నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీల్లో హియరింగ్ కు హాజరయి బిఎల్వోలకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్వోలు సరైన ప్రణాళికతో విధులు నిర్వహించాలని, నోటీసులు అందుకున్న వారిలో ఏ, బి, సి కేటగిరీల వారీగా సంబంధిత ఓటర్లతో అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే తీసుకోవాలని, కుల దృవీకరణ పత్రాలు అవసరమైన వారికి మంజూరు చేసేలా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా తప్పులు లేని, పారదర్శకమైన సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మ్యాపింగ్ కాని, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాక, నిర్దేశిత తేదీల్లో హియరింగ్ కు హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైన వారికి కులదృవీకరణ పత్రాలు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీల సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, బిఎల్ఓ లు, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు.