Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

⏩ సీడీఎంఏ డాక్టర్ టీకే. శ్రీదేవి.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
Share Short Clip Download PDF

⏩హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి/ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కమిషనర్ వెంకన్న, అధికారులతో మాట్లాడిన సిడిఎంఏ.

గ్రేటర్ వరంగల్ మహా నగరానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్ట్ కు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సీడీఎంఏ డాక్టర్ టి.కే శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి గ్రేటర్ వరంగల్ మహా నగరంలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ సంబంధిత అంశాలు, టెండర్ ప్రక్రియ, పనులు చేపట్టే విధానంపై వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కమిషనర్ టి. వెంకన్న, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిడిఎంఏ డాక్టర్ టి.కే శ్రీదేవి మాట్లాడుతూ

గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కు రూపొందించిన డిపిఆర్ కు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా క్రోడీకరించి, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి 15 రోజుల్లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి టెండర్ల ఆహ్వానానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సిడిఎమ్ఏకు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.

ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ రవికుమార్, సిపిఓ రవీంద్ర రాడేకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి