గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణలో భాగంగా అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ లపై ప్రత్యేక నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
మూడు నెలల కాలంలో జిల్లాలో స్కానింగ్ సెంటర్లలో చేపట్టిన తనిఖీల గురించిన వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని, వాటి నివేదికలను పరిశీలించారు. అలాగే అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.