ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280–290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
విద్యుత్ కొరత లేకుండా ముందస్తు చర్యలు