వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి హజరయ్యారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై వారణాసి-వాద్నగర్ సేవా యాత్ర కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. సీఎం చంద్రబాబు తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు అత్యంత సన్నిహితుడు, కష్టసుఖాల్లో తన తండ్రికి తోడుగా నిలిచారంటూ కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.