Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

క్రీడలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఫిజికల్ డైరెక్టర్స్ కృషి చేయాలి

కాకతీయ యూనివర్సిటీ వీసి, ఆచార్యులు కే.ప్రతాప్ రెడ్డి.

క్రీడలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఫిజికల్ డైరెక్టర్స్ కృషి చేయాలి
Share Short Clip Download PDF

క్రీడలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఫిజికల్ డైరెక్టర్లు కృషి చేయాలని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో గురువారం ఉదయం స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య అధ్యక్షతన విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ అధ్యాపకులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వవిద్యాలయంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వీసీ తెలిపారు. పాలక మండలి సమావేశాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నామని, ఇండోర్ క్రీడా సౌకర్యాలను ఒకే ప్రదేశంలో సమీకరించి ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

విశ్వవిద్యాలయంలో అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని, కొత్త క్రీడలను పరిచయం చేసి ప్రోత్సహించాలని సూచించారు. స్పోర్ట్స్ బోర్డు కార్యకలాపాలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని వీసీ సూచించారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాలను నిర్వహించాలని, మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహిళా ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ అధ్యాపకుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు, ఆర్ట్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అలాగే ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా క్రీడా వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ బోర్డు అధ్యక్షులు ఆచార్య వై. వెంకయ్య 2025–26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను సమర్పించారు.

రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ

నిబంధనలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తామని, సామజిక అవసరాలకు తగ్గట్టుగా క్రీడలు ఉండాలి అని, పిల్లలను సన్మార్గం లో నడిపించటం లో వ్యాయమ అధ్యాపకులు పాత్ర ముఖ్యము అని అన్నారు, పాలక మండలి సభ్యులు, పూర్వ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య బి. సురేష్ లాల్ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యంతోనే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ క్రీడా ప్రమాణాలను మరింత పెంచి, విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని అన్నారు. డా. సోమన్న విశ్వవిద్యాలయంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుత, నూతన స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా. టి. శాస్త్రి మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి క్రీడా క్యాలెండర్‌ను రూపొందించి అమలు చేస్తామని, ప్రతి విద్యార్థిలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలో విద్యార్థులకు అందాల్సిన క్రీడా ప్రయోజనాలు, వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రమేష్ రెడ్డి, డా. వెంకన్న, డా. సావిత్రి, డా. ఎ.టి.బి.టి. ప్రసాద్, డా. శ్రీనివాస్ రెడ్డి, డా. రాజేష్, డా. కుమారస్వామితో పాటు విశ్వవిద్యాలయ పరిధిలోని క్రీడా సంచాలకులు, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.