Saturday, 19 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలి
Share Short Clip Download PDF

రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండల తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూభారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ రాణి, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలోని రికార్డు రూము నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. రికార్డు రూముకు సంబంధించిన పలు అంశాలను తహసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. నడికూడలో నిర్మాణంలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రం భవనం పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ధర్మారం–నడికూడ మధ్య కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని కలెక్టర్ పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రామకృష్ణ, ఇతర శాఖల అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.