బీఆర్ఎస్ పార్టీపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ పాలన, ఆ పార్టీ నాయకుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బిఆర్ఎస్ పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.
ప్రజలకు ఇచ్చిన హామీలు, గత పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై రాజకీయాలు కాకుండా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్దపల్లి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మీడియా సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.