తెలంగాణ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నిధులను వాడుకోవచ్చు. ప్రస్తుతం ట్రెజరీలో జమ చేశాక వాటిని డ్రా చేయడానికి అనేక ఇబ్బందులొస్తున్నాయి. పంచాయతీలకు వచ్చే ఆదాయం గ్రామాల అభివృద్ధికే ఉపయోగపడాలని మంత్రి సీతక్క చెప్పారు.