Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

కుడా కార్యాలయంలో టి-ప్రైడ్, టీజీ-ఐపాస్ పథకాల కింద పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సమీక్ష.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
Share Short Clip Download PDF

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

గురువారం, జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (DIPC), టీజీ-ఐపాస్ కమిటీ సమావేశం హనుమకొండ KUDA కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన నిర్వహించారు.

జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ శాఖల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులపై సమావేశంలో సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుమతులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.

TG-iPASS కింద వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన పలు పరిశ్రమల యూనిట్లకు కమిటీ ఆమోదం మంజూరు చేశారు. అలాగే T-PRIDE పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సరకు రవాణా వాహనాలపై అందించే ప్రోత్సాహకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సమీక్షించింది. కమర్షియల్‌ టాక్స్‌ శాఖ స్క్రూటినీ అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నవీన్ కుమార్ , జిల్లా రవాణా అధికారి జనార్దన్ రెడ్డి , ఎల్‌డీఎం విష్ణుప్రియ , కమర్షియల్‌ టాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌, ZM-IIC, కాలుష్య నియంత్రణ మండలి (PCB), విద్యుత్‌ శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌, కుడా, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్‌వాటర్‌ శాఖ, DICCI ప్రతినిధులు సహా మొత్తం 15 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.