చైనా (రైట్స్ మీడియా): జూనియర్ మహిళా ఆసియా కప్ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఆసియా కప్2026లో సెమీస్లోకి దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా గురువారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్- పాక్ జట్లు తలపడ్డాయి.
ఆట ప్రారంభమైన 7వ నిమిషంలోనే పూజా సాహూ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే వరుస గోల్స్ సాధించారు. భారత్ ప్లేయర్లు దూకుడుగా ఆడటంతో ఆది నుంచి పాకిస్థాన్పై ఆధిపత్యం కొనసాగించింది. ఇక 23వ నిమిషంలో మనే మరో గోల్ కొట్టింది. అలానే తనూజ, పూజా మాలిక్, పూర్ణిమా యాదవ్ కూడా గోల్స్ సాధించారు. ఫలితంగా తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్ 10-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు విజృంభించింది.