Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరుబాట

రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరుబాట
Share Short Clip Download PDF

రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ రైతు ధర్నా.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రుద్రగూడెం క్రాస్ రోడ్డు వద్ద వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం నిరసన రైతు ధర్నా నిర్వహించారు. నీటిపారుదల రంగం నిర్లక్ష్యం, రైతుబంధు పథకం అమలులో జాప్యం, రైతుబీమా పునరుద్ధరణలో నిర్లక్ష్యం, యూరియా కొరత, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి మాట్లాడుతూ..
రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన హామీల అమలులో మోసం చేసిందని ఆరోపించారు. ఆగస్టు 14న పునరుద్ధరించాల్సిన రైతుబీమా పథకాన్ని నేటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతుబంధు కింద ఎకరాకు రూ. 15 వేలు, ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ హామీలపై రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో తెచ్చిన రంగయ్య చెరువు ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

రైతు డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలి

మాజీ పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ మాట్లాడుతూ.. పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, మొక్కజొన్న రైతులు పంట విక్రయంలో పడ్డ బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.
రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిగా అమలు చేయాలని, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు . రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నర్సంపేట మాజీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పులి రమేష్, క్లస్టర్ ఇన్‌చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, మామిళ్ల మోహన్ రెడ్డి తదితరులతో పాటు అన్ని గ్రామాల సర్పంచ్ లు, మాజీ ప్రజా ప్రతి నిధులు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.