వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని హేమ బార్ అండ్ రెస్టారెంట్ ముందు శనివారం రాత్రి గొడవ జరుగుతుందని డయల్ 112 కాల్ రావడంతో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాజేష్ అనే కానిస్టేబుల్ వెళ్లి గొడవ ఆపే క్రమంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కానిస్టేబుల్ పై దాడి చేసి టాబ్, మొబైల్ ఫోను ధ్వంసం చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు తెలిపారు.