జిల్లాలోని ప్రతి టీబీ పేషెంట్కు ఆరు నెలలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిక్షయ్ కార్యక్రమం క్రింద టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.