వర్ధన్నపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సంజీవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సీఐ సంజీవరావు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.