సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు ఆర్అండ్బీ రోడ్లకు మంజూర్లు ఇవ్వడంతో పాటు, ఇప్పటికే మంజూరైన రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రహదారిపై పెండింగ్లో ఉన్న కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పనులు పూర్తయితే వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని మంత్రి తెలిపారు.