అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత అందిస్తోందని తెలిపారు.
హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు.