తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
వరంగల్ కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
⏩జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రజాపాలన దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.