గణేశ్ చతుర్ది వేడుకలకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం.. గణేశ్ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వ సహకారం వుంటుంది. ప్రజల పండగకు అండగా ప్రభుత్వం వుంటుంది. గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లోకేష్ ప్రకటించారు. విఘ్వేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
-- మంత్రి నారా లోకేష్.