జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవి తో బాధపడుతున్న ఒక మహిళను ఆమె కుటుంబసభ్యులు అడవిలో వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. అనంతరం, ఆ మహిళను మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నామని చెప్పి కుటుంబసభ్యులు ఆ మహిళను అడవిలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.