పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని, నాటిన ప్రతి మొక్కను రక్షించాలాని, ఇందుకు
ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా మొక్కలు నాటి పెంచడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె అన్నారు.
వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా ఫారెస్ట్ అధికారి నిఖిత,గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్ను ప్రారంభించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.