Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనం: జిల్లా యువజన, క్రీడల అధికారిణి డా. ఓ. జ్యోతి

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు | మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనం: జిల్లా యువజన, క్రీడల అధికారిణి డా. ఓ. జ్యోతి
Share Short Clip Download PDF

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, "ఖేలేగా భారత్ – జీతేగా భారత్" నినాదంతో ఆగస్టు 28 నుండి 30 వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మహబూబాబాద్‌లోని టి.జి.ఎం.ఆర్.ఎస్ (TGMRS) బాలుర పాఠశాల–1లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన & క్రీడల అధికారిణి డా. ఓ. జ్యోతి హాజరై, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అధికారిణి మాట్లాడుతూ..

విద్యార్థి దశ నుంచే క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి మరియు శారీరక దృఢత్వం అలవడతాయన్నారు.

ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆటలు ఎంతో దోహదపడతాయని,
విద్యార్థులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.