నల్గోండ జిల్లా తిప్పర్తి మండలం గంగన్నపాలెంలో మూడు పార్టీల మధ్య ఘర్షణ చేలరేగింది. కత్తిపోట్లకు దారి తీసిన వైనం.. ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు సతీష్, శ్రీకాంత్, నరేష్కు కత్తిపోట్లు తగిలాయి. సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గంగన్న పాలెం సెంటర్ లో మూడు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓ చిన్న వివాదం కాస్తా ముదిరి కత్తిపోట్లకు దారితీసిన వైనం. స్థానిక పోలీసులు ఈ ఘటన పై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కత్తులతో పొడుచుకున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు?