మహబూబాబాద్ జిల్లాలో CMR బియ్యం డెలివరీలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు పడుతున్నట్లు అదనపు కలెక్టర్ (సివిల్ సప్లైస్) & ఎక్స్-అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మహబూబాబాద్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఐదు రైస్ మిల్లులపై కేసులు నమోదు కాగా, తెలంగాణ ప్రభుత్వం – పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన “మిషన్ K-100” కార్యక్రమంలో భాగంగా మరో మూడు డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసి, డిఫాల్ట్ అయిన మొత్తాన్ని మిల్లర్ల వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది.
మిషన్ K-100 కార్యక్రమంలో భాగంగా శ్రీ తిరుమల బిన్నీ రైస్ మిల్లు , కేసముద్రం మరియు శ్రీ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కేసముద్రం తదితర డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రికవరీ చేయడం జరిగింది.