ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు ఇప్పటికే సిఫారసు పంపించారు.
తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించారు.
డా. జి. చిన్నారెడ్డి స్థానంలో గడ్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.