ఘనపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో సోమవారం పెద్దమ్మతల్లి ఆలయానికి భూమిపూజ కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరైనారు. పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ పెద్దమ్మతల్లి, ఇతర దేవతామూర్తుల ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
పెద్దమ్మ తల్లి ఆలయానికి భూమి పూజ
బుద్ధారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.