ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో పాటు ఆయన వెంట ఉన్న మరికొందరిపై కేసు నమోదైంది. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవమానకరంగా తలకిందులుగా ఎగురవేశారనే ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో పాటు ఆయన వెంట ఉన్న మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారన్న ఆరోపణలపై కేసు నమోదు