కూడా పరిధిలో మరో పర్యాటక అభివృద్ధి కి అడుగులు పడనున్నాయి. భద్రకాళి గుడి నుండి చెరువు ఐ లాండ్ వరకు బండ్ కనెక్టివిటీ తో రోప్ వె నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబందించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి అధ్యక్షతన కుడా కార్యాలయం లో సమావేశం నిర్వహించారు.
బిడ్డింగ్ దాఖలు చేసేందుకు అదాని, ఉష బ్రేక్ఓవర్, CSRL,గజానన కంపెనీ లు ముందుకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో... కంపెనీ ప్రతినిధులతో రోప్ వే నిర్మాణానికి సంబందించిన వివిద అంశాలను కలెక్టర్, కుడా అధికారులు, కంపెనీ ప్రతినిధులు చర్చించారు.
ఈ సమావేశం లో కుడా పిఓ అజిత్ రెడ్డి, ఈ ఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.