తాండూరులోని బాలుర సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో భోజనం సమయంలో అదనపు చపాతీ కావాలని అడిగినందుకు తొమ్మిదో తరగతి విద్యార్దులు వాతలు పెట్టారు. ఎనిమిదో తరగతి విద్యార్థి సాయిబాలాజీ కి అదనపు చపాతీ ఎందుకు ఇవ్వాలంటూ సాయిబాలాజీకి పెనంతో వాతలు పెట్టారు. విషయం తెలుసుకుని పోలీసులను తీసుకుని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ఎంతసేపు అడిగినా తల్లిదండ్రులను, పోలీసులను హాస్టల్ లోపలికి సిబ్బంది అనుమతించలేదు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేసారు. మరోవైపు సాయిబాలాజీ తరచూ అందరితో గొడవలు పెట్టుకుంటాడని, గొడవలు పెట్టుకోనని గతంలో లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్టు ప్రిన్సిపల్ తెలిపారు.